My Tenure As CCLA And Some High Profile Land Cases
ఏ అధికారి అయినా ప్రభుత్వం ప్రయోజనాలను కాపాడాలని ప్రయత్నిస్తే - ? "నవ్యాంధ్ర తో న నడక" 11. గీత దాటిన మూర్తి నేను మే 1, 2013న సిసిఎల్ ఏ గా బాధ్యతలు స్వీకరించాను, అప్పటి నుంచీ భూమి అంశాలపై దృష్టి కేంద్రీకరించడం ప్రారంభించాను.తెలంగాణ భూ అంశాలపై ఎక్కువ కేంద్రీకరించాను. ఎందుకంటే భూ అంశాలు తెలంగాణలో చాలా సంక్లిష్టమైనవి. సర్వే వ్యవస్థ అంత పకడ్బందీగా ఉండదు. రెండవది, నిజాం వారసులమని ప్రతి వాడూ ఏదో ఒక ఫర్మానా తెచ్చుకుని, ఎక్కడో ఏదో త్రవ్వి త్రవ్వి, భూములు తమవేనని చెప్పుకుంటారు. కనుక ప్రభుత్వ భూములను పరిరక్షించి, సరిహద్దు గోడల్ని నిర్మించాలని నేను ప్రతిపాదించాను. ఇందుకు రు.30 కోట్లు బడ్జెట్లో కేటాయించేలా చూశాను. హైదరాబాద్ లోనే కాదు మొత్తం రాష్ట్రమంతటా ఎక్కడెక్కడైతే ప్రభుత్వ భూములున్నాయో వాటిని, వివాదాస్పదంగా ఉన్నప్పటికీ ప్రభుత్వానికి అనుకూలంగా ఉన్న భూములను పరిరక్షించాలన్న ఉద్దేశంతో వాటికి సరిహద్దు గోడలు నిర్మించి వాటిపై గీతలు కూడా గీయించాను. ఆరోజు నేను చేసిన పనులు తర్వాత కాలంలో తెలంగాణలో తెలంగాణ ప్రభుత్వానికి కూడా ఉపయోగపడ్డాయి. నిర్దిష్టంగా ఒక బడ్జెట్ పెట్ట...