Posts

Showing posts with the label crda

Amaravathi and other cities of AP - Whose Capital Amaravathi

Image
13. అమరావతి - ఆంధ్రప్రదేశ్‌లోని ఇతర నగరాలు అమరావతి, దాని అభివృద్ధిపై ప్రత్యేక శ్రద్ధ కొత్త ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని ఇతరనగరాల అభివృద్ధిని రాష్ట్ర సమగ్రాభివృద్ధిని కుంటుపరిచే అవకాశం ఉంది. ‘Capital cities Varieties and Patterns of Development and Relocation’ అన్న తన పుస్తకంలో వాదిం రాస్‌మన్, కొన్ని ఆసక్తికరమైన పరిశీలనలు చేశాడు. తగినంత పరిమాణం కలిగిన బలమైన నగరాల నెట్‌వర్క్ ఉన్న దేశాలు, ప్రాంతాలలో రాజధానీనగరాలు స్వాభావికంగానే చిన్నవిగా ఉంటాయనీ, నగరాల నెట్‌వర్క్ చిన్నదిగా ఉండి నగరాలు పరిమాణంలోనూ, సంఖ్యలోనూ తక్కువగా ఉన్నప్పుడు రాజధానీనగరాల పరిమాణం పెద్దదిగా ఉంటుందనీ అతనంటాడు. మధ్యస్థాయి పరిమాణం గల అనేక పట్టణాల నెట్‌వర్కు, వైజాగ్, విజయవాడ, తిరుపతి అనే మూడు పెద్ద నగరాలు రాష్ట్రం మూడు ప్రాంతాలలోనూ ఉండడం ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అదృష్టం.  ఇటువంటి బలమైన నగరాల నెట్‌వర్కు ఉన్న రాష్ట్రంలో ఒక భారీ పరిమాణం గల హరితక్షేత్ర రాజధానీ నగరంపై ప్రత్యేక శ్రద్ధ శివరామకృష్ణన్ కమిటీ చెప్పినట్లు తేనెకుండ ప్రభావాన్ని చూపి, పెట్టుబడులు, నిధులు అన్నీ ఒకే చోట కేంద్రీకృతమై ప్రస్తుతం ఉన్న నగరాల విస్తరణకూ, ఆ...

Swiss Challenge Singapore - Whose Capital Amaravathi

Image
12. స్విస్ ఛాలెంజి - సింగపూరు సంబంధం కొత్త రాజధాని అమరావతి నిర్మాణానికి ప్రణాళిక వేస్తూ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం సమగ్ర మాస్టర్ ప్లాను, వివరణాత్మక మాస్టర్ ప్లానుల రచన కోసం సింగపూరు ప్రభుత్వాన్ని అభ్యర్థించింది. ప్రారంభిక సమగ్ర మాస్టర్ ప్లాన్‌ను సింగపూరు ప్రభుత్వం ఉచితంగానే తయారుచేసింది. కాని వివరణాత్మక మాస్టర్ ప్లాన్ కోసం రాష్ట్రప్రభుత్వం సింగపూరు ప్రభుత్వానికి సంబంధించిన సుర్బానా సంస్థకు 12 కోట్ల రూపాయలు చెల్లించింది. రాష్ట్ర ప్రభుత్వం మరో అడుగు ముందుకు వేసి, స్టార్టప్ ఏరియాలో సీడ్ కాపిటల్ సిటీ నిర్మాణంలో సింగపూరు కంపెనీలకు కాంట్రాక్టు ఇవ్వడంలో అనుసరించిన మొత్తం పద్ధతిని, ప్రక్రియను పరిశీలిస్తే, ఆ కంపెనీలకు కాంట్రాక్టు కట్టబెట్టాలని ముందే నిర్ణయించుకున్నట్లు, తాము ముందే నిర్ణయించుకున్నట్లు సింగపూరు కంపెనీలకు ప్రాజెక్టు నివ్వడానికి కావలసిన ఔపచారిక ప్రక్రియను నిర్వహించినట్లు అనిపించక మానదు.  ఈ లక్ష్యాన్ని సాధించడానికి రాష్ట్ర ప్రభుత్వం స్విస్ ఛాలెంజి పద్ధతిని ఎంచుకుంది. కాని దాన్ని కూడా ఉన్నదున్నట్లుగా కాని, ప్రక్రియ విధి విధానాలను సక్రమంగా అనుసరించకుండా వక్ర మార్గంలో ఈ సి...

World Bank and Amaravathi - Whose Capital Amaravathi

Image
11. ప్రపంచ బాంకు - అమరావతి స్పెషల్ కాటగిరీ స్టేటస్‌కు బదులుగా  భారతప్రభుత్వం ప్రకటించిన స్పెషల్ పాకేజ్ స్కీము నుండి ప్రయోజనం పొందే ఉద్దేశంతో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం సస్టెయినబుల్ కాపిటల్ సిటీ డెవలప్ మెంట్ ప్రాజెక్టుకు ప్రపంచబాంకు ఋణానికి వెళ్లింది. వాస్తవానికి స్పెషల్ కాటగిరీ స్కీములో ఇఎపి ప్రాజెక్టుకు అప్పుగా కాక గ్రాంటురూపంలో సహాయం చేసే కొన్ని వాగ్దానాలున్నాయి. ఈ ప్రాజెక్టులో భాగంగా రోడ్ల మౌలిక సదుపాయాలు, వరదల తగ్గింపు చర్యలు, సాంకేతిక సహాయం ఉంటాయి. ఈ ప్రాజెక్టు అవుట్ లే రూ॥ 5000 కోట్లు. ఇందులో రూ॥ 2000 కోట్లు ప్రపంచ బాంకునుండి అప్పుగా, రూ॥ 1000 కోట్లు ఆసియా అభివృద్ధి బాంకు (ఎడిబి) నుండి అప్పుగా, తక్కిన మొత్తం ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నుండి రావాలి. ఈ ప్రాజెక్టుకు ప్రపంచబాంకు నుండి అప్పు తీసుకునే విషయంపై స్థానిక ప్రజలకు ఎన్నో అభ్యంతరాలున్నాయి.  ప్రపంచ బాంకు నియమాలు, హద్దులను ప్రభుత్వం పాటించకుండానే అమరావతి ప్రాజెక్టుతో ముందుకు వెళ్లింది. అందువల్ల ప్రపంచ బాంకు ఒక ఇన్స్‌పెక్షన్ టీమును ఏర్పరచాలని నిర్ణయించింది. ఈ టీము తమ ఇన్స్‌పెక్షన్ రిపోర్టులో అనేక విషయాలను పేర్కొంది. ఆ ...

Land pooling - Whose Capital Amaravathi

Image
1 0. లాండ్ పూలింగ్ - అమరావతి మౌలిక సదుపాయాల ప్రాజెక్టులలో ఇరుపక్షాలకూ లాభదాయకంగా ఉండే లాండ్ పూలింగ్ ప్రక్రియ ఒక సృజనాత్మక ప్రయోగం. 1890 లలో దీన్ని హాలండ్, జర్మనీలలో విజయవంతంగా ఉపయోగించారు. భారతదేశంలో మొదటిసారి 1915 లో బాంబే టౌన్ ప్లానింగ్ చట్టం కింద ప్రారంభించారు. మాహిం, ఖార్ ప్రాంతాలలో, పెద్ద భాగాల అభివృద్ధికి అది తోడ్పడింది. కాని ఒక చిన్న ప్లాట్లు విషయంలో కూడా యాజమాన్య వివాదాలు ప్రాజెక్టులను అడ్డుకోవడం ప్రారంభించాయి. లాండ్ పూలింగ్‌ను గుజరాత్‌లో 1976 కొత్తగా ఏర్పరచిన చట్టం ద్వారా  అమలుచేయడం ప్రారంభించారు. ప్లాట్ల యాజమాన్య వివాదాల సమస్యను 1999 లో టౌన్ ప్లానింగ్ స్కీమును ఆమోదించిన తర్వాత గుజరాత్‌ అధిగమించింది. వాళ్లు భూమిని స్వాధీనం చేసుకొని రోడ్లు వేయడం ప్రారంభించారు. ఫలితంగా భూముల ధరలు పెరిగాయి. గుజరాత్‌లో లాండ్ పూలింగు జనానికి ప్రోత్సాహమిచ్చింది.   లాండ్ పూలింగ్ అంటే అనేక భూ కమతాలను ఒకటిగా పూల్ చేసి భౌతిక, సామాజిక మౌలిక సదుపాయాల అభివృద్ధిలో ఉపయోగించి మిగిలిన భూమిని భూ యజమానులకు అభివృద్ధి హక్కులతో తిరిగి ఇవ్వడం లాండ్ పూలింగ్ విధానం. ఇట్లా పూల్ చేసిన భూమిలో కొంతభాగా...

A Visionary Statesmen and a Strategic Manipulator - Whose Capital Amaravathi

Image
9. రాజధానీ నగరాలుగా కర్నూలు, అమరావతుల ఎంపికలో భేదం దూరదృష్టి కలిగిన రాజనీతిజ్ఞుడికీ, వ్యూహాత్మక చాణక్యనాయకత్వానికీ ఉన్న భేదం 1953 లో ఆంధ్ర రాజధానిగా కర్నూలును ఎంపిక చేసుకున్న పద్ధతి, 2014 లో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజధానీనగరంగా అమరావతిని ఎంపిక చేసుకున్న పద్ధతి శ్రీ టంగుటూరి ప్రకాశం పంతులు నాయకత్వలక్షణాల గురించీ, శ్రీ నారా చంద్రబాబు నాయుడు నాయకత్వ లక్షణాల గురించీ బోలెడన్ని విశేషాలు చెప్తాయి. దీన్ని గురించి మరింత చర్చించే ముందు 1953 లో ఆంధ్ర రాష్ట్రం ఎలా ఏర్పడిందో తెలుసుకోవడం మంచిది.  1920 నాగపూరు కాంగ్రెస్ సమావేశం స్వతంత్ర భారతదేశంలో భాషాప్రయుక్త రాష్ట్రాల ఏర్పాటుకు సూత్రప్రాయంగా అంగీకరించింది. మద్రాసు ప్రెసిడెన్సీలో ఆంధ్రప్రజలు ప్రత్యేక రాష్ట్రం కోసం ఒక ఉద్యమం చేపట్టడమూ, అది జాతీయోద్యమంతో పాటు, విస్తరించడమూ దీనికి కారణం. 1937 లో శ్రీబాగ్ ఒడంబడికపై సంతకాలు జరిగాయి. రాష్ట్రంలోని విభిన్నప్రాంతాల్లో రాజధానిని ఎక్కడ ఏర్పాటు చేయాలి? ఇతర సంస్థలను ఎక్కడెక్కడ ఏర్పాటు చేయాలి అన్న విషయంలో కోస్తాంధ్ర, రాయలసీమ నాయకుల మధ్య అనౌపచారికంగా ఒక ఒప్పందం కుదిరింది. అప్పటికే ఆంధ్రవిశ్వవిద...

Donakonda ,the Aborted Neutral capital-Whose Capital Amaravathi

Image
8. తటస్థ రాజధానిగా దొనకొండ: విఫలమైన ప్రతిపాదన కొత్తరాష్ట్రం ఆంధ్రప్రదేశ్ రాజధానిగా దొనకొండ ప్రతిపాదన ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర భూపరిపాలన శాఖ ఛీఫ్ కమీషనర్‌గా నేను 2013 మేలో బాధ్యతలు చేపట్టాను. 2013 జులై 30 వ తేదీన కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ పదేండ్లపాటు హైదరాబాదు ఉమ్మడి రాజధానిగా ప్రతిపాదస్తూ కొత్త ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల ఏర్పాటుకు తీర్మానం చేసింది. సిడబ్ల్యుసి తీర్మానం ఆమోదించడంతో రాష్ట్రాన్ని విభజించడానికి కాంగ్రెస్ పార్టీ కృతనిశ్చయమై ఉందనీ, ఈ విభజన జరగడానికి సమయనిర్ణయమే జరగవలసి ఉందనీ అర్థమైపోయింది. నేను భూపరిపాలన శాఖ ఛీఫ్ కమీషనర్ని కావడం వల్ల, రెవిన్యూమంత్రి కొత్త రాష్ట్ర రాజధాని స్థలానికి యోగ్యమైన స్థలాన్ని పరిశీలించవలసిందిగానూ, దానికోసం ప్రభుత్వభూమి, ఎక్కడెక్కడ అందుబాటులో ఉందో అన్వేషించవలసిందిగానూ కోరారు. తదనుగుణంగా పని ప్రారంభించాను. విశాలమైన ప్రభుత్వ భూముల లభ్యతపై సమాచారం పంపవలసిందిగా కలెక్టర్లను కోరాను. అన్ని జిల్లాలనుండి సమాచారం సేకరించాను. ఈ సమాచర విశ్లేషణ వల్ల కొన్ని జిల్లాలలో తగినంత విశాలమైన ప్రభుత్వభూములు లభిస్తున్నాయనీ, ఆ భూములను రాజధానీనగర స్థాపనకు తేలి...

Sivaramakrishnan Commission- Whose Capital Amaravathi

Image
7. శివరామకృష్ణన్ కమిషన్ - అమరావతి రాజధానీనగర సైద్ధాంతిక నేపథ్యాన్నీ, అంతర్జాతీయ జాతీయ అనుభవాలనూ పరిశీలించిన తరువాత, ఈ  అధ్యాయంలో మన అమరావతి స్థల నేపథ్యాన్నీ, అమరావతికి సంబంధించిన ప్రత్యేక సమస్యలను విశ్లేషిద్దాం.  ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పునర్వ్యవస్థీకరణ చట్టం కింద సెక్షన్-6 ఏర్పడబోయే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర నూతన రాజధానికి వివిధ ప్రత్యామ్నాయాలను అధ్యయనం చేయడానికి ఒక నిపుణుల కమిటీని నియమించడానికి అవకాశం ఇస్తుంది. తదనుగుణంగా భారతప్రభుత్వం శ్రీ శివరామకృష్ణన్ చైర్మన్‌గా ఒక కమిటీని నియమించింది. శ్రీ శివరామకృష్ణన్ భారతప్రభుత్వంలో పట్టణాభివృద్ధి శాఖకు మాజీ కార్యదర్శి. ఈ కమిటీ సభ్యులలో ఈ రంగంలో ప్రసిద్ధి చెందిన వ్యక్తులు నేషనల్ ఇన్‌స్టిట్యూట్ అఫ్ పబ్లిక్ ఫైనాన్స్ అండ్ పాలసీ డైరెక్టర్ డా. రతిన్ రాయ్, నేషనల్ ఇన్‌స్టిట్యూట్ అఫ్ అర్బన్ ఎఫైర్స్ డైరెక్టర్ ప్రొ. జగన్ షా, ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ అఫ్ హ్యూమన్ సెటిల్మెంట్స్ డైరెక్టర్ అరోమార్ రవి, స్కూల్ అఫ్ ప్లానింగ్ అండ్ ఆర్కిటెక్చర్ మాజీ డీన్, ప్రొ. రవీంద్రన్ ఉన్నారు.  ఈ కమిటీని నియమిస్తూ భారతప్రభుత్వం అది పరిశీలించవలసిన అంశాలలో స...

Capital Cities of Andhras Through the centuries

Image
6. శతాబ్దాల కాల పరిణామంలో ఆంధ్రుల రాజధానీ నగరాలు మహాభారతం కురుక్షేత్ర యుద్ధంలో ఆంధ్రులు కౌరవుల పక్షాన యుద్ధం చేసినట్లు చెప్తున్నది. వింధ్యపర్వతాలకు దక్షిణప్రాంతంలో నివసిస్తున్న ఒక జాతిగా ఐతరేయ బ్రాహ్మణం ఆంధ్రులను పేర్కొంది. వీరు విశ్వామిత్ర మహర్షి కుమారులనీ, ఆయన వల్ల శాపం పొంది వింధ్యపర్వతాలకు దక్షిణాన స్థిరపడ్డారని పురాణకథనం.  ఆంధ్రులకు సంబంధించి క్రీ.పూ. 2వ శతాబ్ది నుండి క్రీ.శ. 2వ శతాబ్ది వరకు భారతదేశంలోని ప్రధాన భూభాగాలను పరిపాలించిన అతి ప్రాచీన రాజవంశం శాతవాహన వంశం. శాతవాహనుల రాజధాని ధాన్యకటకం నేటి ఆంధ్రప్రదేశ్‌లోని అమరావతి కి సమీపంలో ఉంది. పురాతత్త్వశాస్త్రవేత్తలు ఇక్కడ ఆ నాటికి చెందిన బౌద్ధనిర్మాణాల శిథిలాలను కనుగొన్నారు. శాతవాహనులు తమ రెండవ రాజధానిగా ప్రస్తుత మహారాష్ట్ర ప్రాంతంలోని ప్రతిష్ఠానపురాన్ని ఎంచుకున్నారు. విదేశీయుల దండయాత్రలను - ముఖ్యంగా హూణుల దండయాత్రలను - ఎదుర్కొనడానికి ఇది తోడ్పడుతుందని వాళ్లు భావించారు. భారతదేశమంతటా వ్యాపించిన ఒక బలమైన సామ్రాజ్యాన్ని శాతవాహనులు స్థాపించారు. మంచి పరిపాలనను అందించారు. హిందూ బౌద్ధమతాలు రెండింటినీ ప్రోత్సహించారు....

21st Centuries Capital Cities : Indian Experience

Image
5.  21వ శతాబ్దపు రాజధానీనగరాలు 21వ శతాబ్దపు ప్రారంభంలో ఎన్డీఏ ప్రభుత్వ పరిపాలన కాలంలో దీర్ఘకాలంనుంచి ప్రత్యేక రాష్ట్రం కోసం చేస్తున్న మూడు డిమాండ్లను అంగీకరించడం జరిగింది. దాని ప్రకారం అప్పటి ఉత్తరప్రదేశ్ రాష్ట్రం నుండి పర్వత ప్రాంతాలను వేరు చేసి ఉత్తరాఖండ్ రాష్ట్రాన్ని ఏర్పరిచారు. బీహార్, మధ్యప్రదేశ్ రాష్ట్రాల గిరిజన ప్రాంతాలను వేరుచేసి, ఝార్ఖండ్, ఛత్తీస్‌గఢ్ రాష్ట్రాలను ఏర్పరిచారు. ఈ రాష్ట్రాల రాజధానీనగరాల స్థలాల గురించి ఈ అధ్యాయంలో చర్చిద్దాం.  భారతీయ అనుభవం – ఉత్తరాఖండ్ ఉత్తరప్రదేశ్ నుండి వేరుచేసి దాదాపు కుమావ్, గడువాల్ ప్రాంతాలనన్నింటినీ కలిపి నవంబర్ 2000 లో ఉత్తరాఖండ్ ప్రత్యేకరాష్ట్రాన్ని ఏర్పరిచారు. ఉత్తరాఖండ్ తాత్కాలిక రాజధాని డెహ్రాడూన్ రాష్ట్రంలోని పెద్ద నగరం, దేశ రాజధాని కొత్త ఢిల్లీకి సమీపంలో ఉంది. హై కోర్టు మాత్రం నైనిటాల్‌లో ఉంది. వీరేంద్ర దీక్షిత్ చైర్మన్‌గా 2001 లో రాష్ట్రానికి శాశ్వత రాజధానీ స్థలాన్ని గుర్తించడానికి ఏకసభ్య కమిటీని నియమించారు. కమిటీ 2008 లో నివేదిక సమర్పించింది. ప్రభుత్వం నుంచి సరైన సమర్థన లేకపోవడం వల్ల నివేదికనివ్వడానికి ఏడేళ్ల సమయ...