Posts

Showing posts with the label apformationday

WHOSE CAPITAL AMARAVATHI - THEORETICAL BACKGROUND

Image
. సైద్ధాంతిక నేపథ్యం ‘కాపిటల్ సిటీస్ వెరైటీస్ అండ్ పాటర్న్స్ అఫ్ డెవలప్‌మెంట్ అండ్ రీలొకేషన్’ అన్న తన గ్రంథంలో వాదిమ్ రాస్‌మన్ రాజధానీనగరాల స్థలాల సైద్ధాంతిక నేపథ్యాన్ని విపులంగా చర్చించాడు. అతని అభిప్రాయంలో ఏ రాజధానీనగరానికి స్థల నిర్ణయం చేయాలన్నా ఉండవలసిన ప్రాథమిక ఆలోచనావిషయాలు, ప్రామాణిక సూత్రాలు కొన్ని ఉన్నాయి. వాటిలో రాజ్యభద్రత, ఆర్థిక, పరిపాలనాపరమైన ప్రభావశీలత, నిష్పాక్షికత, గుర్తింపు ఉన్నాయి. ఒక రాష్ట్ర రాజధాని ఎక్కడ ఉండాలన్న విషయంలో భద్రత అంత ఆవశ్యకమైన లక్షణం కాకపోవచ్చు. కాని తక్కిన మూడూ నిష్పాక్షిత, గుర్తింపు,  పరిపాలనా సౌలభ్యం అన్నవి ముఖ్యమే. రాజధాని ఎంపికలో నిష్పాక్షికత  లేనప్పుడు ప్రభుత్వానికి విశ్వసనీయత ఉండదు.  రాష్ట్రంలోని అన్ని ప్రాంతాలు, అన్ని వర్గాలకు రాజధానిలో  సరైన ప్రాతినిధ్యం ఉందా? రాజధానిలో వారు తమకు ఉనికి ఉందని భావిస్తున్నారా? రాజధాని నుండి వచ్చే ప్రయోజనాలు ఆ రాజధాని అన్ని ప్రాంతాలనూ ఎంత కలుపుకొని ఉందన్న విషయాన్ని నిర్ధారిస్తాయి. ఈ నిష్పాక్షికత, అందరినీ కలుపుకోవడం అన్న సూత్రం ప్రభుత్వానికి న్యాయసమ్మతిని ఇస్తుంది. అది లేకపోతే ప్రభుత్...

Whose Capital Amaravathi - Introduction

Image
ఉపోద్ఘాతం  - ‘ఎవరి రాజధాని అమరావతి?’  వలసపాలన రోజుల్లో రాజధానీనగరం రేవు పట్టణమై ఉండేది. దేశం లోతట్టు ప్రాంతాలనుండి వలసరాజ్యానికి ముడి సరకులు ఎగుమతి చేయడానికి, వాణిజ్యానికి ఇది అనుకూలంగా ఉంటుంది. బ్రిటిషువారి కాలంలో 1911 వరకు దేశ రాజధాని ‘కలకత్తా’. తక్కిన సంపన్నమైన ప్రెసిడెన్సీలు ‘బొంబాయి’, ‘మద్రాసు’ ప్రెసిడెన్సీల రాజధానులు బొంబాయి, మద్రాసులు కూడా రేవు పట్టణాలే. ఆ నాడు మద్రాసు ప్రెసిడెన్సీ పెద్ద ప్రెసిడెన్సీ. ఈ ప్రెసిడెన్సీలలో భిన్నభాషలు మాట్లాడే ప్రాంతాలున్నాయి. మద్రాసు (చెన్న పట్టణమని కూడా అంటారు) నుండి పరిపాలింపబడే మద్రాసు ప్రెసిడెన్సీలో, తమిళుల తర్వాత బహుళసంఖ్యలో ఉన్న ప్రజలు తెలుగువారే. కన్నడం, మలయాళం మాట్లాడే ప్రజలు కూడా ఉండేవారు కాని, వారిసంఖ్య తమిళులు, తెలుగువారి కంటే తక్కువ. ముందుగా ఇంగ్లీషు భాష నేర్చుకొని, దాని సహాయంతో ప్రభుత్వోగాలు సంపాదించుకున్నవారు తమిళులు. ప్రభుత్వోద్యోగాలలో అధికభాగం వారి చేతుల్లోనే ఉండేవి. ఇది తక్కిన భాషలు మాట్లాడేవారికి, ముఖ్యంగా అధికసంఖ్యలో ఉన్న తెలుగువారికి బాధాకరంగా పరిణమించింది. భాషాపరంగా ప్రత్యేకరాష్ట్రం కోసం అన్వేషణకు నాయకత్వం వహ...

AP Formation Day

Image
"జైరాం రమేశ్ స్వయంగా ఏపీ భవన్‌కు వచ్చి చంద్రబాబునాయుడుకు సలహా ఇచ్చినందువల్లే ఇవాళ పోలవరంకు అడ్డంకులు తొలిగాయి " -  నవ్యాంధ్రతో నా నడక   13. ఆంధ్రప్రదేశ్‌కు అవతరణ దినోత్సవం లేదా?  జూన్ 2న రెండు రాష్ట్రాలు విడిపోయాయి. తెలంగాణ కొత్త రాష్ట్రంగా అవతరించింది కనుక జూన్ 2 ఆ ప్రాంతానికి ఒక మహత్తరమైన రోజు. అధికారంలోకి వచ్చిన తెలంగాణ రాష్ట్ర సమితి ప్రభుత్వం జూన్ 2న చాలా పెద్ద ఎత్తున అవతరణ దినోత్సవం జరుపుకోవాలని నిర్ణయించింది.  కాని తెలంగాణ నుంచి విడిపోయిన శేష ఆంధ్రప్రదేశ్ అవతరణ దినోత్సవం ఎప్పుడు? జూన్ 2న ముఖ్యమంత్రిగా చంద్రబాబునాయుడు ప్రమాణ స్వీకారం చేయలేదు. అంతేకాక విభజన అనేది ఆంధ్రప్రదేశ్ ప్రజల మనోభావాలకు వ్యతిరేకంగాజరిగింది కనుక జూన్ 2న ఆంధ్రప్రదేశ్ అవతరణ దినోత్సవ సంబరాలు జరుపుకోవడంలో అర్థం లేదు. అంతకుముందు ఆంధ్రప్రదేశ్ అవతరణ దినోత్సవం నవంబర్ 1న జరిగేది. కాని అది ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ గా ఉన్నప్పుడు. ఇప్పుడా విశాలాంధ్ర లేదు. కనుక నవంబర్ 1న ఆంధ్రప్రదేశ్ అవతరణ దినోత్సవం జరుపుకోవడం అర్థరహితం.  కాని ఆంధ్రప్రదేశ్ ఏదో ఒకరోజు అవతరణ దినోత్సవం జరుపుకోవాలి కదా.. అని ...