Posts

Showing posts with the label crowdsourcing

Navyandhra tho na nadaka Hud-hud Cyclone

Image
టెలికమ్యూనికేషన్లను పునరుద్ధరించే విషయంలో ఎయిర్‌టెల్ చైర్మన్ సునీల్ మిట్టల్‌ను పబ్లిక్‌గా తిట్టి టీవీలో పబ్లిసిటీ పొందారు - "నవ్యాంధ్ర తో న నడక"   6. హుద్ హుద్‌లో తల మునకలు రాష్ట్ర విభజన జరిగి నాలుగు నెలలు కాలేదు, హుద్ హుద్ తుఫాను విశాఖను తాకి రాష్ట్రాన్ని అతలాకుతలం చేసింది. అక్టోబర్ 8న తుఫాను వచ్చే సూచనలు కనిపించాయి. అప్పటికి హైదరాబాద్‌లో సెక్రటేరియట్‌లో నేను కొత్త బ్లాకులోకి షిఫ్టు కాలేదు. నేను చిన్నగదిలో పనిచేస్తున్నప్పుడే తుఫాను సమాచారం లభించింది. అండమాన్ వద్ద అల్పపీడనం పెను తుఫాను గాలిగా మారి అక్టోబర్ 12 నాటికి తీవ్రతరమై, కాకినాడ గోపాలపట్నం మధ్య తీరం దాటుతుందని తెలిసింది. ఆ విషయం నేను ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడుకు చెప్పాను. సరే, లెటజ్ ప్రిపేర్ అని ఆయన అన్నారు. ఆ రోజు మధ్యాహ్నమే హుద్ హుద్ తుఫానుకు సంసిద్ధతపై దాదాపు అన్ని విభాగాల అధిపతులతో సమావేశం ఏర్పాటు చేశాను. డీజీపి, అదనపు డీజీపీలు, ఎన్డీఆర్ఎఫ్ బెటాలియన్ కమాండెంట్ తదితరులు కూడా సమావేశంలో పాల్గొన్నారు. 24గంటల పాటు కంట్రోల్ రూంలు ఏర్పాటు చేయాలని, ఫీల్డ్ ఆఫీసర్లను రంగంలోకి దించాలని, సెలవుల్లో ఉన్న అధికారులను వెనక్...