Posts

Showing posts with the label IYRKrishnaRao

Retired IAS Officers forum AP &Telangana Representation to the Governor of AP & Telangana

Image
Dt:   16.04.2019 From, The Retired IAS officers of Andhra Pradesh and Telangana. To His Excellency Governor of Andhra Pradesh &Telangana. Respected Sir, Sub:-   Certain intemperate remarks by Chief Minister of Andhra Pradesh against the Chief Secretary and Chief Electoral Officer –Reg. We,   retired IAS officers of the states of Andhra Pradesh and Telangana, express our anguish at the reported statement of the Chief Minister of AP against the Chief Secretary to the Government of AP and at his behaviour towards the Chief Electoral Officer when he visited latter’s   office on 10th of April.( press clippings attached). As you would note, such a statement by Sri Chandrababu Naidu against the reputation of a brilliant officer like Sri LV Subramanyam militates against public interest since it challenges the legitimate authority of the Election Commission of India. Also the intimidating manner in which Sri Naidu spoke to the Chief Ele...

Whose Capital Amaravathi - The Conclusion

Image
15. ముగింపు/ఉపసంహారం ఈ పుస్తకంలో మనం ఇంతరవరకు ప్రాచీనకాలంలో ఆంధ్రుల రాజధానీనగరాలతో ప్రారంభించి ఆధునికకాలం వరకు, మరింత నిర్దిష్టంగా స్వాతంత్ర్యానంతరం కర్నూలు నుండి హైదరాబాదు ద్వారా 2014 లో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజధానిగా అమరావతిని ప్రకటించడానికి దారితీసిన ప్రక్రియ వరకు చరిత్రను పరిశీలించాం. 1953 లో రాజధానిని కర్నూలులో నిర్ణయించిన నాయకత్వశైలికీ, 2014 లో అమరావతి ఎంపికలో నాయకత్వశైలికీ తారతమ్యం చూశాం. రాజధానీనగర స్థలాల ఎంపికలో సైద్ధాంతిక నేపథ్యాన్ని చారిత్రిక దృక్కోణంలో పరిశీలించాం.  వివిధ ఖండాలలో రాజధానీ నగరాల స్థాపనలో అంతర్జాతీయ అనుభవాలను, స్వాతంత్ర్యానంతరం మన దేశంలో రాజధానీ నగరాల ఏర్పాటు అనుభవాలను, 21వ శతాబ్దంలో ప్రజల డిమాండుపై రాష్ట్రాలను విభజించడం వల్ల కొత్తగా ఏర్పరచవలసి వచ్చిన రాజధానుల అనుభవాలను పరిశీలించాం. అమరావతికి నిర్దిష్టమైన, ప్రత్యేకమైన సమస్యల దృష్ట్యా లాండ్ పూలింగు, మల్టీ లేటరల్ ఏజెన్సీలనుండి ఆర్థిక సహాయం, కొన్ని విదేశాలు, కంపెనీలకు ప్రత్యేక ప్రాధాన్యమిచ్చి రాజధానీనగరం అమరావతి నిర్మాణానికి ఆహ్వానించిన ప్రభుత్వ ప్రయత్నాలు మొదలైనవాటి గురించి గత అధ్యాయాలలో చర్చిం...

Ghost Cities of China - Whose Capital Amaravthi

Image
14. చైనా ఘోస్ట్ నగరాలు - నేర్చుకోవలసిన పాఠాలు చైనా ఎంత వేగంగా నగరాలు నిర్మించిందంటే, జనం వాటిలోకి తరలిరావడానికి సమయం చాల లేదు. డిమాండు ననుసరించి పట్టణ ప్రాంతాలను క్రమంగా విస్తరించడానికి బదులు, చైనా పూర్తిగా కొత్తనగరాలను అన్నిటినీ ఒక్కసారిగా నిర్మించాలని తలపెట్టిందని ఆండ్రూ టరంటోలా తన వ్యాసంలో రాశాడు. ఇందులో ఒక లాభం ఉంది సెంట్రల్ ప్లానింగ్, సమగ్ర పట్టణ ప్రణాళికలకు అవకాశం ఏర్పడుతుంది. కాని మొత్తం ప్రాజెక్టే ప్రమాదంలో పడింది, ఎందుకంటే జనం ఆ నగరాలకు తరలడానికి ఇష్టపడలేదు. మొక్కజొన్న పొలాలలో నిర్మించిన న్యూ సౌత్ చైనా మాల్, దాన్ని ప్రారంభించిన దశాబ్దం తర్వాత కూడా 99% జనావాస రహితంగానే ఉండిపోయింది. దీన్ని 2005 లో 8,92,000 చదరపు మీటర్ల బిల్డప్ ఏరియాలో నిర్మించారు. తియాందు చెంగ్ హాంగ్ ఝాన్‌లో కొత్తగా నిర్మించిన తియాందు చెంగ్ నగరంలో జనమే లేరు. ఈ నగరంలో ఐఫెల్ టవర్‌కి ప్రతిరూపం ఉండడం విశేషం. 2003 లో సెంట్రల్ మంగోలియాలో ఉత్తర చైనా దుబాయిగా పిలిచే కాంగ్ బాషి రియల్ ఎస్టేట్ స్పెక్యులేషన్‌కు బలిపశువయింది. రియల్ ఎస్టేట్ స్పెక్యులేటర్లు ఈ నగరంలో చేరి సముచితమైన మార్కెట్ ధరలకంటే చాలా అధికం...

Amaravathi and other cities of AP - Whose Capital Amaravathi

Image
13. అమరావతి - ఆంధ్రప్రదేశ్‌లోని ఇతర నగరాలు అమరావతి, దాని అభివృద్ధిపై ప్రత్యేక శ్రద్ధ కొత్త ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని ఇతరనగరాల అభివృద్ధిని రాష్ట్ర సమగ్రాభివృద్ధిని కుంటుపరిచే అవకాశం ఉంది. ‘Capital cities Varieties and Patterns of Development and Relocation’ అన్న తన పుస్తకంలో వాదిం రాస్‌మన్, కొన్ని ఆసక్తికరమైన పరిశీలనలు చేశాడు. తగినంత పరిమాణం కలిగిన బలమైన నగరాల నెట్‌వర్క్ ఉన్న దేశాలు, ప్రాంతాలలో రాజధానీనగరాలు స్వాభావికంగానే చిన్నవిగా ఉంటాయనీ, నగరాల నెట్‌వర్క్ చిన్నదిగా ఉండి నగరాలు పరిమాణంలోనూ, సంఖ్యలోనూ తక్కువగా ఉన్నప్పుడు రాజధానీనగరాల పరిమాణం పెద్దదిగా ఉంటుందనీ అతనంటాడు. మధ్యస్థాయి పరిమాణం గల అనేక పట్టణాల నెట్‌వర్కు, వైజాగ్, విజయవాడ, తిరుపతి అనే మూడు పెద్ద నగరాలు రాష్ట్రం మూడు ప్రాంతాలలోనూ ఉండడం ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అదృష్టం.  ఇటువంటి బలమైన నగరాల నెట్‌వర్కు ఉన్న రాష్ట్రంలో ఒక భారీ పరిమాణం గల హరితక్షేత్ర రాజధానీ నగరంపై ప్రత్యేక శ్రద్ధ శివరామకృష్ణన్ కమిటీ చెప్పినట్లు తేనెకుండ ప్రభావాన్ని చూపి, పెట్టుబడులు, నిధులు అన్నీ ఒకే చోట కేంద్రీకృతమై ప్రస్తుతం ఉన్న నగరాల విస్తరణకూ, ఆ...

Swiss Challenge Singapore - Whose Capital Amaravathi

Image
12. స్విస్ ఛాలెంజి - సింగపూరు సంబంధం కొత్త రాజధాని అమరావతి నిర్మాణానికి ప్రణాళిక వేస్తూ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం సమగ్ర మాస్టర్ ప్లాను, వివరణాత్మక మాస్టర్ ప్లానుల రచన కోసం సింగపూరు ప్రభుత్వాన్ని అభ్యర్థించింది. ప్రారంభిక సమగ్ర మాస్టర్ ప్లాన్‌ను సింగపూరు ప్రభుత్వం ఉచితంగానే తయారుచేసింది. కాని వివరణాత్మక మాస్టర్ ప్లాన్ కోసం రాష్ట్రప్రభుత్వం సింగపూరు ప్రభుత్వానికి సంబంధించిన సుర్బానా సంస్థకు 12 కోట్ల రూపాయలు చెల్లించింది. రాష్ట్ర ప్రభుత్వం మరో అడుగు ముందుకు వేసి, స్టార్టప్ ఏరియాలో సీడ్ కాపిటల్ సిటీ నిర్మాణంలో సింగపూరు కంపెనీలకు కాంట్రాక్టు ఇవ్వడంలో అనుసరించిన మొత్తం పద్ధతిని, ప్రక్రియను పరిశీలిస్తే, ఆ కంపెనీలకు కాంట్రాక్టు కట్టబెట్టాలని ముందే నిర్ణయించుకున్నట్లు, తాము ముందే నిర్ణయించుకున్నట్లు సింగపూరు కంపెనీలకు ప్రాజెక్టు నివ్వడానికి కావలసిన ఔపచారిక ప్రక్రియను నిర్వహించినట్లు అనిపించక మానదు.  ఈ లక్ష్యాన్ని సాధించడానికి రాష్ట్ర ప్రభుత్వం స్విస్ ఛాలెంజి పద్ధతిని ఎంచుకుంది. కాని దాన్ని కూడా ఉన్నదున్నట్లుగా కాని, ప్రక్రియ విధి విధానాలను సక్రమంగా అనుసరించకుండా వక్ర మార్గంలో ఈ సి...

World Bank and Amaravathi - Whose Capital Amaravathi

Image
11. ప్రపంచ బాంకు - అమరావతి స్పెషల్ కాటగిరీ స్టేటస్‌కు బదులుగా  భారతప్రభుత్వం ప్రకటించిన స్పెషల్ పాకేజ్ స్కీము నుండి ప్రయోజనం పొందే ఉద్దేశంతో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం సస్టెయినబుల్ కాపిటల్ సిటీ డెవలప్ మెంట్ ప్రాజెక్టుకు ప్రపంచబాంకు ఋణానికి వెళ్లింది. వాస్తవానికి స్పెషల్ కాటగిరీ స్కీములో ఇఎపి ప్రాజెక్టుకు అప్పుగా కాక గ్రాంటురూపంలో సహాయం చేసే కొన్ని వాగ్దానాలున్నాయి. ఈ ప్రాజెక్టులో భాగంగా రోడ్ల మౌలిక సదుపాయాలు, వరదల తగ్గింపు చర్యలు, సాంకేతిక సహాయం ఉంటాయి. ఈ ప్రాజెక్టు అవుట్ లే రూ॥ 5000 కోట్లు. ఇందులో రూ॥ 2000 కోట్లు ప్రపంచ బాంకునుండి అప్పుగా, రూ॥ 1000 కోట్లు ఆసియా అభివృద్ధి బాంకు (ఎడిబి) నుండి అప్పుగా, తక్కిన మొత్తం ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నుండి రావాలి. ఈ ప్రాజెక్టుకు ప్రపంచబాంకు నుండి అప్పు తీసుకునే విషయంపై స్థానిక ప్రజలకు ఎన్నో అభ్యంతరాలున్నాయి.  ప్రపంచ బాంకు నియమాలు, హద్దులను ప్రభుత్వం పాటించకుండానే అమరావతి ప్రాజెక్టుతో ముందుకు వెళ్లింది. అందువల్ల ప్రపంచ బాంకు ఒక ఇన్స్‌పెక్షన్ టీమును ఏర్పరచాలని నిర్ణయించింది. ఈ టీము తమ ఇన్స్‌పెక్షన్ రిపోర్టులో అనేక విషయాలను పేర్కొంది. ఆ ...

Land pooling - Whose Capital Amaravathi

Image
1 0. లాండ్ పూలింగ్ - అమరావతి మౌలిక సదుపాయాల ప్రాజెక్టులలో ఇరుపక్షాలకూ లాభదాయకంగా ఉండే లాండ్ పూలింగ్ ప్రక్రియ ఒక సృజనాత్మక ప్రయోగం. 1890 లలో దీన్ని హాలండ్, జర్మనీలలో విజయవంతంగా ఉపయోగించారు. భారతదేశంలో మొదటిసారి 1915 లో బాంబే టౌన్ ప్లానింగ్ చట్టం కింద ప్రారంభించారు. మాహిం, ఖార్ ప్రాంతాలలో, పెద్ద భాగాల అభివృద్ధికి అది తోడ్పడింది. కాని ఒక చిన్న ప్లాట్లు విషయంలో కూడా యాజమాన్య వివాదాలు ప్రాజెక్టులను అడ్డుకోవడం ప్రారంభించాయి. లాండ్ పూలింగ్‌ను గుజరాత్‌లో 1976 కొత్తగా ఏర్పరచిన చట్టం ద్వారా  అమలుచేయడం ప్రారంభించారు. ప్లాట్ల యాజమాన్య వివాదాల సమస్యను 1999 లో టౌన్ ప్లానింగ్ స్కీమును ఆమోదించిన తర్వాత గుజరాత్‌ అధిగమించింది. వాళ్లు భూమిని స్వాధీనం చేసుకొని రోడ్లు వేయడం ప్రారంభించారు. ఫలితంగా భూముల ధరలు పెరిగాయి. గుజరాత్‌లో లాండ్ పూలింగు జనానికి ప్రోత్సాహమిచ్చింది.   లాండ్ పూలింగ్ అంటే అనేక భూ కమతాలను ఒకటిగా పూల్ చేసి భౌతిక, సామాజిక మౌలిక సదుపాయాల అభివృద్ధిలో ఉపయోగించి మిగిలిన భూమిని భూ యజమానులకు అభివృద్ధి హక్కులతో తిరిగి ఇవ్వడం లాండ్ పూలింగ్ విధానం. ఇట్లా పూల్ చేసిన భూమిలో కొంతభాగా...