Posts

Showing posts with the label kcr

సామరస్యమే సరైన పరిష్కారం

Image
విశ్లేషణ ఏ సమస్యల పరిష్కారానికైనా కాలగతి ఎంత ముఖ్యమో అనువైన వాతావరణం కూడా అంతే ముఖ్యమని హిపోక్రిటస్‌ పేర్కొన్నాడు. విభజనానంతరం తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రాల మధ్య గతంలో చాలా చిక్కుముళ్లు ఏర్పడటం వాస్తవమే కానీ రెండు తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రుల మధ్య ప్రస్తుతం ఉన్న సుహృద్భావ వాతావరణం మిగిలి ఉన్న సమస్యల పరిష్కారానికి అత్యంత అనుకూలతను ఏర్పరుస్తోంది. ఉద్యోగుల విభజన వంటి కొన్ని అంశాలు గతంలోనే దాదాపుగా పరిష్కృతమయ్యాయి. మిగిలి ఉన్న రెండు ప్రధాన అంశాలు షెడ్యూల్‌ 9 షెడ్యూల్‌ 10కి చెందిన సంస్థల విభజన. కోర్టుల వరకు వెళ్లిన షెడ్యూల్‌ 10కి చెందిన సంస్థల విభజన అంశాన్ని ఇప్పుడు రెండు రాష్ట్రాలు ఉమ్మడిగా పరిష్కరించుకోవచ్చు. ఇక 9వ షెడ్యూల్‌కి చెందిన వాణిజ్యపరమైన సంస్థల విషయంలో కూడా సామరస్యంగా పరిష్కరించుకోవడం పెద్ద సమస్య కాకపోవచ్చు.  సాధారణంగా అన్నదమ్ముల మధ్య ఆస్తి తగాదాలు అంత సులభంగా పరిష్కారం కావు. పంతాలు, పట్టింపులు ప్రధాన పాత్ర పోషిస్తాయి కాబట్టి మామూలుగా అంత ప్రధానం కాని అంశాలు కూడా ప్రాధాన్యతను సంతరించుకుంటాయి. రాష్ట్రాల విభజనలో కూడా ఇటువంటి పరిస్థితులే ఉత్పన్నం అవుతాయనడంలో...

My Relations With Telangana CM ,KCR -Navyandhratho na nadaka

Image
కేసిఆర్ ముఖం విప్పారింది. బొటన వేలు చూపించి ‘డన్’ అన్నారు. .... "నవ్యాంధ్ర తో నా నడక"   9. కేసిఆర్‌తో సంబంధాలు ఆంధ్రప్రదేశ్ ప్రయోజనాలకోసం నేనెంత పోరాడినా, తెలంగాణ ముఖ్యమంత్రి కేసిఆర్‌కు నేనంటే మంచి అభిప్రాయమే ఉండేదని తెలిసింది. ‘మీరంటే ఆయనకు అభిమానం.. మీ నిజాయితీని ఆయన గౌరవిస్తారు..’ అని రాజీవ్ శర్మ ఒక సందర్భంలో చెప్పారు. నేను కేసిఆర్ ను ఒకటి రెండు సందర్భాల్లో తప్ప కలుసుకోలేదు. కలుసుకోవాల్సిన అవసరం రాలేదు.  2015 డిసెంబర్ లో కేసిఆర్ ఆయుత చండీ యాగం తలపెట్టినప్పుడు మాత్రం ఆయనను కలుసుకునే అవకాశం లభించింది. అప్పుడు నేను ఛీఫ్ సెక్రటరీగానే ఉన్నాను.అప్పటికి నాకు ఆహ్వానం రాలేదు. యాగనిర్వాహకుల్లో ఒకరైన వెంకట రమణ శర్మ ఒకరోజు నాకు ఫోన్ చేశారు.  ‘యాగానికి ఎప్పుడు వస్తున్నారు సార్’ అని ఆయన అడిగారు.  ‘నాకు ఆహ్వానం అందలేదండీ’ అని చెప్పాను.  ఆయన ఆశ్చర్యపోయారు. ‘మీకు ఆహ్వానం లేకపోవడమేమిటి సార్, మీరు వస్తారన్న చర్చ కూడా జరిగింది. ఎక్కడో పొరపాటు అయినట్లుంది. ఉండండి. మీతో మళ్లీ మాట్లాడుతాను’ అని ఫోన్ పెట్టేశారు. సరిగ్గా మూడు నిమిషాల్లో ముఖ్యమంత్రి కార్యాలయం ...

"Our people briefed me"- Navyandhra tho na nadaka

Image
7. ‘అవర్ పీపుల్ బ్రీఫ్డ్ మి’ 2015 జూన్ 1 సాయంత్రం T.V. పెట్టినప్పుడు ‘అవర్ పీపుల్ బ్రీఫ్డ్‌మి’ ఉదంతం ప్రసారమవుతుంది. ఈ సంభాషణ వినగానే నాకు మతిపోయినట్లయింది. ఒక సిఎం ఎన్నికల అక్రమాలను ప్రోత్సహిస్తున్నట్లు ఆరోపణలు రావడం, ఆయన గొంతును కూడా వినిపించడంతో ఆయన ప్రతిష్ఠ దెబ్బతింటుందనే అనిపించింది. నిజానికి అంతకు ముందే తెలుగుదేశం ఎమ్మెల్యే రేవంత్ రెడ్డి స్టీఫెన్‌సన్ ఇంటికి వెళ్లి శాసన మండలి ఎన్నికల్లో తమ అభ్యర్థికి అనుకూలంగా ఓటువేసేందుకు అయనకు డబ్బులు ఇవ్వజూపినట్లు టీవీలు చూపించాయి. ఇప్పుడు ఏకంగా ముఖ్యమంత్రే ఫోన్‌లో మాట్లాడినట్లు చూపిస్తున్నారు.  సాయంత్రానికల్లా రాష్ట్ర సలహాదారు పరకాల ప్రభాకర్ స్వయంగా టీవీల ముందుకు వచ్చి జరిగిన దాన్ని ఖండించారు. ‘ఒక రాష్ట్ర ముఖ్యమంత్రి పట్ల తెలంగాణ ప్రభుత్వం వ్యవహరించే తీరు ఇదేనా? ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విభజన చట్టం సెక్షన్ 8 ప్రకారం గవర్నర్‌గారికి ఇక్కడున్నటువంటి శాంతి భద్రతలు, ప్రజల యొక్క స్వేచ్ఛ, ప్రజల యొక్క ఆస్తులు, ముఖ్యమైనటువంటి సంస్థల విషయంలో బాధ్యత ఉన్నది. వారు బాధ్యత తీసుకోనప్పుడు, వారు దీన్ని నడపనప్పుడు, రెండు రాష్ట్ర ప్రభుత్వాలకు, ఆంధ్ర...