Posts

Showing posts with the label pulse2019

Swiss Challenge Singapore - Whose Capital Amaravathi

Image
12. స్విస్ ఛాలెంజి - సింగపూరు సంబంధం కొత్త రాజధాని అమరావతి నిర్మాణానికి ప్రణాళిక వేస్తూ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం సమగ్ర మాస్టర్ ప్లాను, వివరణాత్మక మాస్టర్ ప్లానుల రచన కోసం సింగపూరు ప్రభుత్వాన్ని అభ్యర్థించింది. ప్రారంభిక సమగ్ర మాస్టర్ ప్లాన్‌ను సింగపూరు ప్రభుత్వం ఉచితంగానే తయారుచేసింది. కాని వివరణాత్మక మాస్టర్ ప్లాన్ కోసం రాష్ట్రప్రభుత్వం సింగపూరు ప్రభుత్వానికి సంబంధించిన సుర్బానా సంస్థకు 12 కోట్ల రూపాయలు చెల్లించింది. రాష్ట్ర ప్రభుత్వం మరో అడుగు ముందుకు వేసి, స్టార్టప్ ఏరియాలో సీడ్ కాపిటల్ సిటీ నిర్మాణంలో సింగపూరు కంపెనీలకు కాంట్రాక్టు ఇవ్వడంలో అనుసరించిన మొత్తం పద్ధతిని, ప్రక్రియను పరిశీలిస్తే, ఆ కంపెనీలకు కాంట్రాక్టు కట్టబెట్టాలని ముందే నిర్ణయించుకున్నట్లు, తాము ముందే నిర్ణయించుకున్నట్లు సింగపూరు కంపెనీలకు ప్రాజెక్టు నివ్వడానికి కావలసిన ఔపచారిక ప్రక్రియను నిర్వహించినట్లు అనిపించక మానదు.  ఈ లక్ష్యాన్ని సాధించడానికి రాష్ట్ర ప్రభుత్వం స్విస్ ఛాలెంజి పద్ధతిని ఎంచుకుంది. కాని దాన్ని కూడా ఉన్నదున్నట్లుగా కాని, ప్రక్రియ విధి విధానాలను సక్రమంగా అనుసరించకుండా వక్ర మార్గంలో ఈ సి...

A Visionary Statesmen and a Strategic Manipulator - Whose Capital Amaravathi

Image
9. రాజధానీ నగరాలుగా కర్నూలు, అమరావతుల ఎంపికలో భేదం దూరదృష్టి కలిగిన రాజనీతిజ్ఞుడికీ, వ్యూహాత్మక చాణక్యనాయకత్వానికీ ఉన్న భేదం 1953 లో ఆంధ్ర రాజధానిగా కర్నూలును ఎంపిక చేసుకున్న పద్ధతి, 2014 లో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజధానీనగరంగా అమరావతిని ఎంపిక చేసుకున్న పద్ధతి శ్రీ టంగుటూరి ప్రకాశం పంతులు నాయకత్వలక్షణాల గురించీ, శ్రీ నారా చంద్రబాబు నాయుడు నాయకత్వ లక్షణాల గురించీ బోలెడన్ని విశేషాలు చెప్తాయి. దీన్ని గురించి మరింత చర్చించే ముందు 1953 లో ఆంధ్ర రాష్ట్రం ఎలా ఏర్పడిందో తెలుసుకోవడం మంచిది.  1920 నాగపూరు కాంగ్రెస్ సమావేశం స్వతంత్ర భారతదేశంలో భాషాప్రయుక్త రాష్ట్రాల ఏర్పాటుకు సూత్రప్రాయంగా అంగీకరించింది. మద్రాసు ప్రెసిడెన్సీలో ఆంధ్రప్రజలు ప్రత్యేక రాష్ట్రం కోసం ఒక ఉద్యమం చేపట్టడమూ, అది జాతీయోద్యమంతో పాటు, విస్తరించడమూ దీనికి కారణం. 1937 లో శ్రీబాగ్ ఒడంబడికపై సంతకాలు జరిగాయి. రాష్ట్రంలోని విభిన్నప్రాంతాల్లో రాజధానిని ఎక్కడ ఏర్పాటు చేయాలి? ఇతర సంస్థలను ఎక్కడెక్కడ ఏర్పాటు చేయాలి అన్న విషయంలో కోస్తాంధ్ర, రాయలసీమ నాయకుల మధ్య అనౌపచారికంగా ఒక ఒప్పందం కుదిరింది. అప్పటికే ఆంధ్రవిశ్వవిద...

Donakonda ,the Aborted Neutral capital-Whose Capital Amaravathi

Image
8. తటస్థ రాజధానిగా దొనకొండ: విఫలమైన ప్రతిపాదన కొత్తరాష్ట్రం ఆంధ్రప్రదేశ్ రాజధానిగా దొనకొండ ప్రతిపాదన ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర భూపరిపాలన శాఖ ఛీఫ్ కమీషనర్‌గా నేను 2013 మేలో బాధ్యతలు చేపట్టాను. 2013 జులై 30 వ తేదీన కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ పదేండ్లపాటు హైదరాబాదు ఉమ్మడి రాజధానిగా ప్రతిపాదస్తూ కొత్త ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల ఏర్పాటుకు తీర్మానం చేసింది. సిడబ్ల్యుసి తీర్మానం ఆమోదించడంతో రాష్ట్రాన్ని విభజించడానికి కాంగ్రెస్ పార్టీ కృతనిశ్చయమై ఉందనీ, ఈ విభజన జరగడానికి సమయనిర్ణయమే జరగవలసి ఉందనీ అర్థమైపోయింది. నేను భూపరిపాలన శాఖ ఛీఫ్ కమీషనర్ని కావడం వల్ల, రెవిన్యూమంత్రి కొత్త రాష్ట్ర రాజధాని స్థలానికి యోగ్యమైన స్థలాన్ని పరిశీలించవలసిందిగానూ, దానికోసం ప్రభుత్వభూమి, ఎక్కడెక్కడ అందుబాటులో ఉందో అన్వేషించవలసిందిగానూ కోరారు. తదనుగుణంగా పని ప్రారంభించాను. విశాలమైన ప్రభుత్వ భూముల లభ్యతపై సమాచారం పంపవలసిందిగా కలెక్టర్లను కోరాను. అన్ని జిల్లాలనుండి సమాచారం సేకరించాను. ఈ సమాచర విశ్లేషణ వల్ల కొన్ని జిల్లాలలో తగినంత విశాలమైన ప్రభుత్వభూములు లభిస్తున్నాయనీ, ఆ భూములను రాజధానీనగర స్థాపనకు తేలి...

WHOSE CAPITAL AMARAVATHI - AMARAVATHI LOCATION

Image
1. అమరావతి ప్రదేశం ఈ నేపథ్యంలోనే పార్లమెంటుకు, ఆంధ్రప్రదేశ్ శాసనసభకు 2014 ఏప్రిల్, మే నెలల్లో ఎన్నికలు జరిగాయి. కేంద్రంలో బిజెపి, ఆంధ్రప్రదేశ్‌లో చంద్రబాబు నాయుడు నాయకత్వంలో తెలుగుదేశం పార్టీ విజయం సాధించి అధికారంలోకి వచ్చాయి. ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రం తెలంగాణ, మిగిలిన ఆంధ్రప్రదేశ్‌లుగా అపాయింటెడ్ డే 02-06-2014 న విభాజితమై ఉనికిలోకి వచ్చినప్పటికీ, 19 మంది మంత్రుల శ్రీ చంద్రబాబు నాయుడు మంత్రివర్గం జూన్ 8, 2014 న ప్రమాణస్వీకారం చేసింది. శుభముహూర్తంగా భావించిన ఆ రోజు గుంటూరులో నాగార్జున విశ్వవిద్యాలయానికి ఎదురుగా ఉన్న స్థలంలో, ప్రమాణస్వీకార మహోత్సవం బహిరంగసభలో జరిగింది. ఆ సమయంలో రాజధానీనగరం నాగార్జున విశ్వవిద్యాలయం ప్రాంతంలోనో, మంగళగిరి పోలీస్ బెటాలియన్ ప్రాంతంలోనో ఏర్పడుతుందని చెప్పుకున్నారు. మంత్రివర్గంలో శ్రీ నారాయణ కూడా ఉన్నారు. మునిసిపల్ అడ్మినిస్ట్రేషన్, అర్బన్ డెవలప్ మెంట్ శాఖలు ఇవ్వబడిన నారాయణ, ముఖ్యమంత్రితోపాటు రాజధానీనగర స్థలనిర్ణయంలో కీలకపాత్ర వహించవలసి ఉంది. ఆయన శాసనసభలో కాని, శాసన మండలిలో కాని అప్పటికి సభ్యుడు కాదు. తరువాత 2014 ఆగస్టులో శాసనమండలికి ఎన్నికయ్యారు. ఎన్నికల సమ...

Whose Capital Amaravathi - Introduction

Image
ఉపోద్ఘాతం  - ‘ఎవరి రాజధాని అమరావతి?’  వలసపాలన రోజుల్లో రాజధానీనగరం రేవు పట్టణమై ఉండేది. దేశం లోతట్టు ప్రాంతాలనుండి వలసరాజ్యానికి ముడి సరకులు ఎగుమతి చేయడానికి, వాణిజ్యానికి ఇది అనుకూలంగా ఉంటుంది. బ్రిటిషువారి కాలంలో 1911 వరకు దేశ రాజధాని ‘కలకత్తా’. తక్కిన సంపన్నమైన ప్రెసిడెన్సీలు ‘బొంబాయి’, ‘మద్రాసు’ ప్రెసిడెన్సీల రాజధానులు బొంబాయి, మద్రాసులు కూడా రేవు పట్టణాలే. ఆ నాడు మద్రాసు ప్రెసిడెన్సీ పెద్ద ప్రెసిడెన్సీ. ఈ ప్రెసిడెన్సీలలో భిన్నభాషలు మాట్లాడే ప్రాంతాలున్నాయి. మద్రాసు (చెన్న పట్టణమని కూడా అంటారు) నుండి పరిపాలింపబడే మద్రాసు ప్రెసిడెన్సీలో, తమిళుల తర్వాత బహుళసంఖ్యలో ఉన్న ప్రజలు తెలుగువారే. కన్నడం, మలయాళం మాట్లాడే ప్రజలు కూడా ఉండేవారు కాని, వారిసంఖ్య తమిళులు, తెలుగువారి కంటే తక్కువ. ముందుగా ఇంగ్లీషు భాష నేర్చుకొని, దాని సహాయంతో ప్రభుత్వోగాలు సంపాదించుకున్నవారు తమిళులు. ప్రభుత్వోద్యోగాలలో అధికభాగం వారి చేతుల్లోనే ఉండేవి. ఇది తక్కిన భాషలు మాట్లాడేవారికి, ముఖ్యంగా అధికసంఖ్యలో ఉన్న తెలుగువారికి బాధాకరంగా పరిణమించింది. భాషాపరంగా ప్రత్యేకరాష్ట్రం కోసం అన్వేషణకు నాయకత్వం వహ...

Yevari Rajadhani Amaravathi - Foreword by Sri Vadde Sobhanadriswararao

Image
ముందుమాట - "ఎవరి రాజధాని అమరావతి?’  ఇక్కడ భూమిలేని పేదల సగటు నెలవారీ సంపాదన ఒక్కొక్క కుటుంబానికి 15,000 వేల రూపాయలు వుండగా సి.ఆర్.డి.ఏ. వారికి నెలకు 2,500 మాత్రమే చెల్లించడం చాలా విచారకరం. వందలాది కుటుంబాలు ఉపాధి వెతుక్కుంటూ ఇతర ప్రాంతాలకి వలసపోవలసి వస్తున్నది. ‘ఎవరి రాజధాని అమరావతి?’ అన్న ఈ పుస్తకం ప్రపంచ వ్యాప్తంగా వివిధ దేశాల రాజధానీ నగరాల గురించి విఫులమైన సమాచారాన్ని అందిస్తూ ఉంది. రాజధానీ నగరాలను ఏర్పాటుచేయవలసిన ప్రదేశాల ఎంపికకు వెనుకవున్న వివిధ అంశాలను ఈ పుస్తకం చర్చించింది. అనేక రాజధానీ నగరాల గురించి విస్తృతంగా చర్చించింది. వాటి స్థలాల ఎంపికకు వెనుక వున్న ఆర్థిక, సాంస్కృతిక, జాతి, ప్రాంతాది కారణాలను వివరించింది. చండీగఢ్, గాంధీనగర్, భువనేశ్వర్, నయా రాయపూర్ వంటి కొత్త రాజధానీ నగరాల గురించిన సమాచారాన్ని వాటి ఆర్కిటెక్టులు ప్రణాళికల ప్రత్యేక లక్షణాలను గురించిన సమాచారాన్ని ఇచ్చింది. ఇక రాష్ట్రవిభజన తరువాత ఆంధ్రప్రదేశ్ నూతన రాజధానీ విషయానికి వస్తే శ్రీ కృష్ణారావు సి.సి.ఎల్.ఏ. గాను, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిగాను నవ్యాంధ్రప్రదేశ్ రాజధానీ స్థలం కోసం అందుబాటులో వున్న ప్రభుత్వ...

Competitive populism is back

Image
With elections round the corner all parties are coming up with their manifestos promising the moon to the public. There is competitive populism all around and the display of one-upmanship. If somebody already is giving 2000 rupees as pensions the other promises 3,000. Not to lag behind some other party promises 5000. The list goes on touching different groups and segments of population. Two things are strikingly missing in most of these manifestos. No one spells out where the money would come from. There is no budgeting and a statement of where the revenues are expected to be generated to finance these freebies. No one mentions in the manifesto measures aimed at good governance , eradication corruption, transparency in public life and provision of gainful employment which would ensure increase in income levels across all sections of population leading to a qualitatively better life which the above freebies promise. Rahul Gandhi of the Indian National Congress promises to implement un...